ఢిల్లీలో బిఆర్ఎస్ భవన్ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
న్యూఢిల్లీః తెలంగాణ సిఎం కెసిఆర్ ఢిల్లీలోని వసంత్ విహార్లోనూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ భవన్ను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భవన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కెసిఆర్. అనంతరం మ. 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి భవన్లోకి ప్రవేశించారు కెసిఆర్. భవన్లో దుర్గామాత అమ్మవారికి కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భవనంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్కు కెసిఆర్ వెళ్లి కుర్చీలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్కు పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో కెసిఆర్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.