తెలంగాణలో ఒక్కరోజే 879 కొత్త కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553

corona virus
corona virus

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మంగళవారం రాష్ట్రంలో 879 మందికి పాజిటివ్ వచ్చింది. మరో ముగ్గురు చనిపోయారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో 652, మేడ్చల్‌లో 112, రంగారెడ్డిలో 64, వరంగల్ రూరల్‌లో 14, కామారెడ్డిలో 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగాంలో 7, నాగర్ కర్నూలులో 4, సంగారెడ్డి, మహబూబాబాద్‌లో 2 కేసుల చొప్పున, మెదక్‌లో ఒక కేసు నమోదయ్యాయి. కాగా తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,553కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 4,224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,109 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం 3,006 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,217 మందికి నెగెటివ్ వచ్చింది. 879 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 63,249 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/