మెదక్‌లో బిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

cm-kcr-inaugurates-medak-district-brs-party-office

మెదక్‌: సిఎం కెసిఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్‌ చేరుకున్న ఆయన ముందుగా బిఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు. అనంతరం శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఆ తర్వాత అక్కడి ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు.