గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సిఎం జగన్ సమీక్ష
మరో 24గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్
అమరావతిః సిఎం జగన్ ఈరోజు ఉదయం గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈనేపథ్యంలో ఆయన అధికారులతో మాట్లాడి గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలన్నారు. వరదల నేపథ్యంలో మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం జగన్ ఆదేశాంచారు.
సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/