గంగవరం పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత

Extreme tension at Gangavaram port

గంగవరం : ఏపీలోని గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంగవరం పోర్టు ప్రధాన ద్వారం వద్దకి కార్మికులు, కార్మిక సంఘం నేతలు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే కార్మికులకు పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పది మంది పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాజువాక సీ. ఐ కాలికి ముల్ల కంచె దిగింది.

అలాగే ఇద్దరు కానిస్టేబుళ్లకు తలకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బ్యారి కెడ్లు పెట్టి అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు . ఛలో గంగవరం పోర్టుకు కార్మికల సంఘం పిలుపునివ్వడంతో గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీత భత్యాలు పెంచాలనే డిమాండ్‌ తో ఛలో గంగవరం పోర్టుకు కార్మికల సంఘం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇచ్చారు.