పాదయాత్రలో నేతన్నల బాధలు విన్నాను : సీఎం

చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

అమరావతి : నేడు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తాను గతంలో చేపట్టిన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలను కళ్లారా చూశానని తెలిపారు. వారి బాధలు తాను విన్నానని పేర్కొన్నారు. అందుకే, తాము అధికారంలోకి రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హులైన వారికి ఏటా రూ.24 వేలు ఇస్తున్నామని, తద్వారా వారికి అండగా ఉంటున్నామని వివరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/