నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి
హైదరాబాద్: మాజీమంత్రి ఈటల రాజేందర్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన రాజీనామతోనే సీఎం కేసీఆర్ అడుగు బయట పెట్టారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం కూలికి పోయి డబ్బులు తేవడం లేదని, మన డబ్బులే మనకు పంచి పెడుతున్నారని తెలిపారు. కాగా, ఇటీవల ఈటల రాజేందర్ మోకాలికి ఆర్థోస్కోపి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే .
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/