రేపు శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించనున్న సిఎం జగన్‌

cm jagan

అమరావతిః సిఎం జగన్‌ రేపు శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అలాగే.. పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభలో కూడా సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం మొదటగా కంచిలి మండలం మకరాంపురంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

అనంతరం పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అనంతరం రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని సిఎం జగన్‌ ప్రసంగించనున్న. సాయంత్రం తిరిగి తాడేపల్లికి ప్రయాణం కానున్నారు.