నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లకు సిఎం జగన్‌ శంకుస్థాపన

ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్నామన్న కాకాని

cm-jagan-land-breaking-ceremony-for-bio-ethanol-plant

అమరావతిః సిఎం జగన్‌ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో నిర్మించనున్న రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్లకు శంకుస్థాపన చేశారు. తన కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. రూ. 925 కోట్ల వ్యవయంతో ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. క్రిబ్కో విశ్వసముద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్లాంట్లను నిర్మిస్తున్నారు. వీటి వల్ల స్థానికంగా ఉన్న దాదాపు 75 శాతం యుతకు ఉపాధి లభిస్తుంది.

శంకుస్థాపన అనంతరం కాకాని గోవర్ధన్ మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చొరవతో పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగామని అన్నారు. ప్లాంట్లకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం ఇచ్చామని చెప్పారు. ఈ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.