సీఎం జగన్ ఇంత దిగజారి పోతారని అనుకోలేదు
రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి మీడియా ప్రతినిధులపై కేసులు పెడతారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మరోసారి టిడిపి నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ ఇంత దిగజారిపోతారని అనుకోలేదని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమాన్ని అణిచివేయాడానికి మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టడానికి సీఎం జగన్ సిగ్గుపడాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి స్కూల్ను ఆక్రమించే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తల్లిదండ్రుల ఆందోళన ప్రపంచానికి చూపిస్తే మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెడతారా అని దుయ్యబట్టారు. మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమైందన్నారు. మీడియా స్వేచ్ఛని హరించిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయరని అన్నారు. తప్పుడు కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నారాలోకేష్ డిమాండ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోస క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/