స్మార్ట్‌ సిటీ..అమరావతి, విశాఖలకు అవార్డులు

విశాఖలో స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం

vishakapatnam
vishakapatnam

విశాఖ: విశాఖలో స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటైంది. ఈనేపథ్యంలో స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉత్తమ ఫలితాలు కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి ఈ పురస్కారం లభించింది. విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆకర్షణీయ నగరాల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. కాగా, విశాఖపట్నం నగరానికి వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/