దర్శి బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సిఎం జగన్‌ సంతాపం

cm-jagan

అమరావతి: ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్‌సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.