ప్రభాస్-సుకుమార్ మూవీ ఫై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – పుష్ప ఫేమ్ సుకుమార్ కలయికలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతుందని..ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్నట్లు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ వార్తల ఫై అభిషేక్ పిక్చర్స్ వారు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని , ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు.

తమ బ్యానర్ నుంచి ఎప్పటికప్పుడు మంచి చిత్రాలను అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటామనీ, ఆ విషయాలను అధికారికంగా తాము తెలియజేస్తూ ఉంటామని అన్నారు. పుకార్లను నమ్మొద్దని తెలిపారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఒకటి , రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఆదిపురుష్ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా..సలార్, ప్రాజెక్ట్ కె , మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ ఇలా మూడు సెట్స్ ఫై ఉన్నాయి.