ఓ చోట నా ఫై పూల వర్షం..కాసేపట్లోనే కోడిగుడ్లు విసిరారు – చిరంజీవి

ఇటీవల ఓటిటి లకు ఎంత డిమాండ్ పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు. కేవలం సినిమాలే కాదు పలు టాక్ షోస్ , డాన్స్ షోస్ , ఇంటర్వూస్ ఇలా సరికొత్త కార్యక్రమాలు చేస్తూ అలరిస్తున్నారు. తెలుగు ఓటిటి ఛానల్ ఆహా లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె’ షో సూపర్ సక్సెస్ కావడం తో మిగతా ఓటిటి చానెల్స్ సైతం ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘సోనీ లీవ్’ కూడా కొత్తగా ‘హాయ్ రబ్బా’ ఫేమ్ స్మిత హోస్ట్ గా ‘నిజం విత్ స్మిత’ పేరుతో ఓ సెలబ్రిటీ షో మొదలుపెట్టింది. ఫస్ట్ ఎపిసోడ్ ఫిబ్రవరి 10 న స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ షోకు సంబందించిన ఫస్ట్ ఎపిసోడ్ ని ‘కష్టేఫలి అప్ మొబిలిటీ’ అనే పేరుతో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా ఈ షోని ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరి 10 న స్ట్రిమింగ్ కాబోతున్న ఈ తొలి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని బుధవారం విడుదల చేశారు.

ప్రోమో ప్రారంభంలో చిరంజీవి ని షోలోకి గ్రాండ్ గా స్మిత ఆహ్వానించింది. ‘కాలేజీ డేస్ లో మీ ఫస్ట్ క్రష్ ఏంటీ అని అడగడం తో చిరు కాస్త సందేహంగా జవాబు చెప్పాలా? .. దాట వేయాలా అనే సందగ్థంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత స్టార్ డమ్ అనేది కొంత మందికే..ఒక స్టేజ్ కి వెళ్లాలంటే అవమానాలు అంటూ మరో ప్రశ్న సంధించింది.

దీనికి చిరంజీవి సమాధానం చెబుతూ ‘జగిత్యాలలో పై నుంచి పూల వర్షం కురిసింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు తీసుకుని కొట్టారు’ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. మళ్లీ ఒక వరప్రసాద్ నుంచి మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఈ రోజు వుందంటారా? అని స్మిత అడిగితే.. చిరంజీవి నుంచి నిశ్శబ్దం వినిపించింది. ఫిబ్రవరి 10 న స్ట్రిమింగ్ కాబోతున్న ఈ తొలి ఎపిసోడ్ లో స్మిత ఎలాంటి ప్రశ్నల్ని సంధించింది. చిరంజీవి ఎలాంటి సమాధానాలు చెప్పారనేది చూడాలి. మొత్తం మీద ఈ ఎపిసోడ్ తాలూకా ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.