కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే తన వాహన శ్రేణికి ఉన్న జీరో ట్రాఫిక్ ప్రొటోకాల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొ్నారు. ఈ ప్రొటోకాల్ వల్ల రోడ్లపై ట్రాఫిక స్తంభించి ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్టర్‌లో తెలిపారు.

అలాగే ప్రభుత్వ లేదా వ్యక్తిగత కార్యక్రమాల్లో ప్రజలు తనకు ఇచ్చే పుష్పగుచ్ఛాలు, శాలువాలు కూడా స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానుకల ద్వార గౌరవాన్ని చూపించాలనుకునేవారు పుస్తకాలు ఇవ్వొచ్చని సూచించారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సిద్దరామయ్య సీఎం గా , డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు.