అడ్డదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లను తాను పట్టించుకోను – చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా మంత్రి రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా ఈయన నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో పలు మీడియా చానెల్స్ కు వరుస ఇంటర్వూస్ ఇస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాదానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వైస్సార్సీపీ మంత్రి రోజా చేసిన కామెంట్స్ ఫై చిరంజీవి పరోక్షంగా స్పందించారు.

తన గురించి మాట్లాడితేనే వాళ్లకు గుర్తింపు వస్తుందని , అడ్డదారిలో గుర్తింపు కోరుకునే వాళ్లు తనను, తన ఫ్యామిలీని తిడుతుంటారని చిరంజీవి అన్నారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తనతో స్నేహంగా ఉన్నవాళ్లే ఇప్పుడు తన గురించి మాట్లాడుతున్నారని చిరంజీవి విమర్శించారు. రోజా మంత్రి అయిన తర్వాత తన ఇంటికి కూడా వచ్చారని, ఇప్పుడు ఆమె ఎందుకు ఇలా మాట్లాడిందో ఆమెనే అడగాలని చెప్పారు. తాను ఎవరికీ సహాయం చేయలేదని అంటున్నారని, తన గురించి తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

అంతకు ముందు రోజా మాట్లాడుతూ..సినిమాల్లో ప్రజల డబ్బుతో మెగా ఫ్యామిలీ ఎంతో ఎత్తుకు ఎదిగిందని, కానీ ప్రజలకు వారు ఒక చిన్న సాయం కూడా చేయలేదని, అందుకే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని ఆమె అన్నారు. మెగా బ్రదర్స్ కు రాజకీయ భవిష్యత్తు లేదని తెలిపింది. ఈ వాఖ్యాలపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం రోజా ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు చిరు కూడా ఆమె పేరు ఎత్తకుండా ఫైర్ అయ్యారు.