చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపిన మోడీ

శనివారం ప్రధాని మోడీ రెండు వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. ముందుగా ఉదయం హైదరాబాద్ లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ కు పచ్చ జెండా ఊపిన మోడీ..ఆ తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం తమిళనాడు కు బయలుదేరారు.

తమిళనాడులోనూ మరో వందేభారత్ రైలును ప్రారంభించారు. చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ లో జరిగిన కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్, తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా పాల్గొన్నారు. .