భార్య, పిల్లలను చంపి.. కలెక్టర్ గన్మన్ ఆత్మహత్య
హైదరాబాద్ః సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో చోటు చేసుకుంది. ఆకుల నరేశ్ అనే కానిస్టేబుల్ కలెక్టర్ గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నరేశ్.. తన భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కూతురు హిమశ్రీని తుపాకీతో కాల్చాడు. అనంతరం తానుకూడా కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్ మెన్ గా నరేష్ పనిచేస్తున్నాడు.