విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫై చరణ్ ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..విజయ్ దేవరకొండ అభిమానులపై ప్రశంసలు కురిపించాడు. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ సందర్బంగా విజయ్ ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు వెళ్లి రక్తదానం చేశారు. అందుకే, వాళ్లను రామ్ చరణ్ మెచ్చుకున్నారు. ఈ సందర్బంగా చరణ్ ట్వీట్ చేసాడు.
‘హ్యాపీ బర్త్డే విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు వచ్చి రక్తదానం చేసిన నీ ఫ్యాన్స్ను కచ్చితంగా మెచ్చుకోవాలి’ అని రామ్ చరణ్ ట్వీట్లో పేర్కొన్నారు. రామ్ చరణ్ ట్వీట్కు విజయ్ దేవరకొండ స్పందించారు. ‘థాంక్యూ అన్న’ అంటూ ట్వీట్ చేశారు. తన అభిమానులు ఎప్పుడూ తాను గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేస్తారని అన్నారు. తన అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ చేసిన కామెంట్లు వాళ్లు వింటే ఎంతో సంతోషిస్తారని పేర్కొన్నారు.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన స్వరపరిచి, ఆలపించిన ‘నా రోజా నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ను ఈరోజు విడుదల చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.