ఆదిపురుష్ ట్రైలర్ టాక్
ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఈరోజు సోమవారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయగా..యూట్యూబ్ లో పలు రికార్డ్స్ నెలకొల్పుతుంది. సినిమాలో రామాయణం లోని కీలక ఘట్టాలన్నీ కూడా చూపించబోతున్నట్లుగా ట్రైలర్ ని చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. రాముడిగా ప్రభాస్ మరియు సీత పాత్రలో కృతి సనన్ ను చూడబోతున్నాం. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. నటీ నటుల నటనతో పాటు అద్భుతమైన విజువల్స్ ఈ సినిమా స్థాయిని అమాంతం పెంచుతాయని ట్రైలర్ ని చూస్తూ అర్థం అవుతుంది.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే వి.ఎఫ్.ఎక్స్ పనుల్లో జరిగిన లోపాల కారణంగా సాధారణ ఆడయెన్స్తో పాటు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ఆదిపురుష్ ఔట్పుట్పై పెదవి విరిచారు. దాంతో మేకర్స్ వెంటనే సినిమాను వాయిదా వేసి ఆరు నెలలు పాటు లండన్కు వెళ్లి మళ్లీ వి.ఎఫ్.ఎక్స్ పనులపై ఫోకస్ చేసి ఔట్పుట్ విషయంలో కేర్ తీసుకున్నారు.