సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనలో మార్పులు

హైదరాబాద్: సీఎం కెసిఆర్ జగిత్యాల జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మెటీపల్లిలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను సీఎం పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డుమార్గం ద్వారా రేగుంటకు చేరుకోనున్న సీఎం… మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు సుమన్ స్వగ్రామం రేగుంటలోని సుమన్ ఇంటివద్ద ఉండనున్నారు. సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. సుమన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ వెళ్ళనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/