దేశంలో కొత్తగా 92,596 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,89,069
మొత్తం మృతుల సంఖ్య 3,53,528
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 92,596 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మరో 1,62,664 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 2,219 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,53,528కు పెరిగింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,89,069కు చేరాయి. ఇందులో 2,75,04,126 మంది కోలుకున్నారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,01,93,563 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,85,967 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/