ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోండి..సీఎస్‌కు చంద్రబాబు లేఖ

chandrababu

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్‌ జవహర్‌ రెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అధికార వైఎస్‌ఆర్‌సిపి నాయకులతో అధికారులు కుమ్మక్కై పెన్నా నదిలో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్దపప్పూరు అక్రమ తవ్వకాలపై హైకోర్టులోనే విచారణ జరిగిందని గుర్తు చేశారు. ‘‘అడ్డగోలు తవ్వకాలతో పర్యావరణానికి నష్టం జరుగుతుంది. ఎన్జీటీతోపాటు కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నా అక్రమ తవ్వకాలను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలు, అధికారులు విఫలమయ్యారు. పరిస్థితి చేయిదాటి పోకముందే సహజ వనరులను కాపాడుకోవాలి’’ అని చంద్రబాబు లేఖలో తెలిపారు.