నేడు గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు
అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని శివకాశీపురం, కుక్కునూరులలో పర్యటించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లో ముంపు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం పర్యటించనున్నారు. రాత్రికి భద్రాచలం లో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/