ఆర్-5 జోన్ పేరిట రైతులకు, పేదలకు మధ్య చిచ్చు పెడుతున్నారుః చంద్రబాబు

chandrababu

అమరావతిః టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాళ్లను మోసగించడం కోసమే ప్రభుత్వం ఆర్-5 జోన్ ను తీసుకువచ్చిందని ఆరోపించారు. రైతులకు, పేదలకు మధ్య చిచ్చు పెట్టడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు.

నాడు సీఆర్డీఏ విధివిధానాల్లో భాగంగా 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించడం జరిగిందని, కానీ వైఎస్‌ఆర్‌సిపి ఆర్-5 జోన్ పేరిట ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇరుపక్షాల మేలు కోరి టిడిపి నిర్ణయం తీసుకుంటే, వైఎస్‌ఆర్‌సిపి అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అన్నారు. అటు పేదలను మోసం చేయడమే కాకుండా, ఇటు రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.