తమ హయాంలో 29 లక్షల ఇళ్లు మంజూరు

గత ఏడాదిగా ఇళ్ల పనులు ఆపేశారని ఆరోపణ

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. పేదల కోసం నాడు టిడిపి ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించిందని వెల్లడించారు. మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. మరో 4.02 లక్షల మందికి 7,475 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని తెలిపారు. అయితే, గత ఏడాదిగా ఇళ్ల పనులన్నీ ఆపేశారని, టిడిపిపై అక్కసుతో పూర్తైన ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ ఓ కుంభకోణంలా మారిందని, ఎకరా రూ.7 లక్షల విలువ చేయని భూములను రూ.45 లక్షల నుంచి రూ.70 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైఎస్‌ఆర్‌సిపి నేతలు దోపిడీకి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/