తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి మీడియా కు తెలిపిన చంద్రబాబు

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న ను ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. శుక్రవారం నారా లోకేష్ పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న ..కాసేపటికే నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కార్య కర్తలు హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ (నారాయణ హృదయాలయ) లో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పడం తో నందమూరి , నారా ఫ్యామిలీ సభ్యులు హాస్పటల్ కు వస్తున్నారు.

శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం బెంగళూరుకు చేరుకున్నారు. నారాయణ హృదయాలయ హాస్పటల్ డాక్టర్స్ ను అడిగి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా తో .. తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారని వెల్లడించారు. డాక్టర్స్ తో తాను మాట్లాడానని, తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం లోకేశ్ యువగళం పాదయాత్రకు తారకరత్న వచ్చారని, పాదయాత్ర సమయంలో తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. కుప్పం ఆసుపత్రిలో తారకరత్నకు ప్రాథమిక వైద్యం అందించారని, ఎందుకైనా మంచిదని బెంగళూరు ఆసుపత్రి నుంచి కూడా వైద్యులను రప్పించామని చంద్రబాబు వివరించారు. వైద్యుల సలహాపై మరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తీసుకువచ్చినట్టు తెలిపారు. రక్తప్రసరణలో ఇంకా గ్యాప్ లు వస్తున్నాయని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. వైద్యులు ఏ చికిత్స చేయాలో నిర్ణయించి, ఆ దిశగా ముందుకుపోతారని చంద్రబాబు తెలిపారు.