జగన్ ఎన్నికల్లో ఓడిపోతే ఏ జైలుకు వెళ్తాడో – చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఈరోజు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షో కోసం విచ్చేసిన చంద్రబాబుకు పెద్దాపురం నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. జె.తిమ్మాపురం వద్ద చంద్రబాబుకు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గజమాలతో స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట భారీ కాన్వాయ్ తో టీడీపీ శ్రేణులు ర్యాలీగా కదిలాయి.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఫై నిప్పులు చెరిగారు. రేపు ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడికి పారిపోతాడో, ఏ జైలుకు పోతాడో తెలియదు అని ఎద్దేవా చేసారు. జగన్ సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాడని విమర్శించారు. ప్రజలపై రూ.10 లక్షల కోట్ల రుణభారం మోపారని తెలిపారు. ఒక ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉంటే వారిపై రూ.10 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క అని చంద్రబాబు వివరించారు. ఆ అప్పు మీరే కట్టాలి… జగన్ మోహన్ రెడ్డి కట్టడు అని వ్యాఖ్యానించారు. ఆ అప్పు అంత మన నెత్తిపైనే ఉంటుందని, బ్యాంకు వాళ్లు వచ్చేది మన ఇంటికేనని స్పష్టం చేశారు. మన ఆస్తులను, మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి అని వివరించారు.