ఎన్టీఆర్ పెద్ద సంస్క‌ర‌ణ వాది : చంద్ర‌బాబు

ప్రకాశం: స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఎన్టీఆర్ విగ్ర‌హం నుంచి మ‌హానాడు వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు చంద్ర‌బాబు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఎన్టీఆర్ యుగ పురుషుడ‌ని తెలిపారు. టీడీపీ హ‌యాంలోనే ఒంగోలు అభివృద్ధి జ‌రిగింద‌ని అన్నారు. ఎన్టీఆర్ పెద్ద సంస్క‌ర‌ణ వాది. ముందు చూపు ఉన్న‌నాయ‌కుడ‌ని చంద్ర‌బాబు తెలిపారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదవారికి ఏం కావాలో తెలుసుకుని అందించిన మహా వ్యక్తి అని అన్నారు.

తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరన్న సంగతి ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోవాలని చంద్రబాబునాయుడు హితవుపలికారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని బస్సులకు కూడా అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. మ‌నకు జ‌నాలు ఉన్నారు. వైస్సార్సీపీకి బస్సులే ఉన్నాయ‌న్నారు. మ‌న స‌భ‌కి జ‌నం రాకుండా అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టిస్తున్నార‌న్న‌రు. మ‌నం ఏమ‌న్నా వైస్సార్సీపీకి బానిస‌ల‌మా అని నిల‌దీశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/