36 గంటలపాటు దీక్ష కు సిద్దమైన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ఫై వైసీపీ కార్యకర్తలు , నేతలు చేసిన దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటలపాటు దీక్ష కు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు.

టీడీపీ కార్యాలయంలో ధ్వంసమైన వాహనాలు, ఫర్నిచర్ మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నారు. టీడీపీ నేత పట్టాభి.. సీఎం వైఎస్‌ జగన్‌పై చేసిన కామెంట్ల తర్వాత.. టీడీపీ హెడ్‌ ఆఫీసుతో పాటు.. కొన్ని జిల్లాల్లోని ఆఫీసులపై కూడా దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఇక, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. కేంద్ర హోంశాఖ, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు.. ఇంతకంటే దారుణం ఏముంటుంది.. రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసారు. ఇక ఈరోజు కూడా టీడీపీ రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.