45ఏళ్ల రాజకీయ జీవితంలో జనసేనకు ఇచ్చినంత ప్రాధాన్యం ఎవరికీ ఇవ్వలేదు – బాబు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి – జనసేన ఉమ్మడి గా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టేశాయి. ఈరోజు నెల్లూరులో పర్యటించిన బాబు..ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కానీ.. జనసేనకు ఇచ్చినంత ప్రాధాన్యం ఎవరికీ ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. పొత్తులో భాగంగా పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా.. 175 స్థానాల్లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల కార్యకర్తలపై ఉందని చెప్పారు.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు.. వేమిరెడ్డి రాకతో నెల్లూరు ఎంపీ సీటు గెలుపు సులువైందన్నారు. ఈ రోజు టీడీపీ అభ్యర్థులు 151 మంది కాదు. 175 మందీ అభ్యర్థులే. జనసేనకు 24 కాదు 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలు, నాయకులపైన ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం నూతన ఉత్సాహం నింపింది. ఆయన రాకతో పార్లమెంటులో సునాయాసంగా గెలుస్తున్నాం అనే అభిప్రాయానికి వచ్చాం” అని చంద్రబాబు నాయుడు అన్నారు.