కొవ్వూరు సమీపంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ..

ఏపీఎస్ ఆర్టీసీ బస్ ప్రమాదానికి గురైంది. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం బస్ వెళ్తుండగా.. ధవళేశ్వరం వంతనపైకి రాగానే ఒక్కసారిగా బస్సు లో విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ జరిగింది. దీంతో.. ఒక్కసారిగా పెద్దఎత్తున పొగలు వచ్చాయి.

పొగలు బస్సు మొత్తాన్నీ కమ్మేశాయి. ఒక్కసారిగా బస్ అంత పొగతో నిండిపోవడం తో ప్రయాణికులు భయపడ్డారు. ఒకరిపై ఒకరు పడుతూ బస్సు నుండి కిందకు దిగే ప్రయత్నం చేసారు. డ్రైవర్ వెంటనే బస్సు ను వంతెనే పైనే అర్ధంతరంగా ఆపేసి, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు.