నేడు ఏపీ హైకోర్టు లో చంద్రబాబు కేసులపై విచారణ..

chandrababu-naidu

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ఫై ఉన్న అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు ఫై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరగనుంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేయబోతుంది. చంద్రబాబుకి బెయిల్ ఇవ్వద్దని ఇప్పటికే 470 పేజీలతో అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.. సీఐడీ. అటు అమరావతి అసైన్డ్ భూములు కొనుగోలు కేసులో మాజీ మంత్రి నారాయణ ఇతరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు మీద విచారణ జరగనుంది.

అలాగే స్కిల్‌ కేసులో చంద్రబాబుకు ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ సవాల్ చేసింది. దీనిపై విచారణను జరిపిన ధర్మాసనం.. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. అలాగే హైకోర్టు ఇచ్చిన షరతుల్లో మార్పులు చేస్తూ.. నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు పబ్లిక్‌ మీటింగ్‌లకు హాజరు కావొచ్చని తెలిపింది. అయితే.. కేసు గురించి మాత్రం మాట్లాడవద్దని ఆదేశించింది అత్యున్నత ధర్మాసనం.