కమలం కండువా కప్పుకున్న పీఎల్ శ్రీనివాస్, వెళ్లల రామ్మోహన్

PL Srinivas and vellala rammohan joined BJP

హైదరాబాద్ః లోక్ సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. శుక్రవారం కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో… పీఎల్ శ్రీనివాస్, ఆయన కూతురు, ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు. పీఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో రాష్ట్ర, జాతీయస్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేశారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బిజెపి కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెళ్లల రామ్మోహన్ కూడా కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు బిజెపిలో చేరారు. వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.