యువగళం విజయోత్సవ సభకు రానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న టిడిపి, జనసేన
అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టిడిపి భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ సభకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభ నుంచే టిడిపి, జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఇరువురు నేతలు ఆ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలిరానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టిడిపి ఏర్పాటు చేసింది.