ఏపీ అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: ఏపీ సర్కారు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఊరటనిచ్చింది. అదనపు రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఏపీ సర్కారుకు కీలక అనుమతులు మంజూరు చేసింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను అందుకున్న 11 రాష్ట్రాలకు కేంద్రం ఈ అనుమతులు ఇవ్వగా, అందులో ఏపీ కూడా ఉంది. ఈ ప్రోత్సాహకం ద్వారా ఏపీ రూ.2,665 కోట్లు సమీకరించుకోవచ్చు. మార్కెట్ నుంచి అదనంగా రూ.15,721 కోట్ల వరకు సమీకరించుకోవచ్చు. ఈ రుణాలను ఏపీ సర్కారు 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్వీకరించాల్సి ఉంటుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/