బ్రేకింగ్: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం
ఎన్సీపీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటున్నా.. శరద్ పవార్
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ చీఫ్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఆయనే స్వయంగా ఈరోజు ఉదయం ప్రకటించారు. అయితే, పవార్ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఆయన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తన వారసుడిగా లేదా వారసురాలిగా ఎవరికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.