వాహనదారులకు షాక్..ఏప్రిల్ 01 నుండి భారీగా పెరగనున్న టోల్ చార్జీలు

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) వాహనదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 01 నుండి టోల్ చార్జీలు భారీగా పెంచబోతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచారు.

ఇప్పటికే నిత్యావసర వస్తువులు , గ్యాస్ , పెట్రోల్ , కరెంట్ ఇలా ప్రతిదీ భారీగా పెరగడం తో సామాన్యలు బ్రతికే రోజులు లేవు అని మాట్లాడుకుంటున్న సమయంలో ఇప్పుడు టోల్ చార్జీల పెరగడం , ఆ భారం సామాన్య ప్రజానీకం ఫై పడనుంది. మరోపక్క మందులపై కూడా కేంద్రం భారం మోపింది. దాదాపు అన్ని మందులపై 60% వరకు పెంచింది. కరోనా సంక్షోభంలో మందులకు డిమాండ్‌ పెరిగిందని, ఉచిత వ్యాక్సినేషన్‌ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చయ్యాయన్న సాకు చెప్పి కిందటేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం వడ్డించింది.