గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు
కోల్కతా: ఢిల్లీలో ప్రయాణిస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ కాన్వాయ్లోకి మరో వాహనం దూసుకువచ్చింది. దీంతో విధ్వంసం జరుగుతుందో ఏమో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకువచ్చిన కారు డ్రైవర్ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు.
గవర్నర్ను హై సెక్యూర్టీ ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అంతకుముందు రోజు బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతాన్ని గవర్నర్ ఆనంద్ బోస్ విజిట్ చేశారు. అక్కడ టీఎంసీ నేత సాజహన్ షేక్ అకృత్యాలు ఎక్కువయ్యాయని మహిళలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.