జమ్ము-శ్రీనగర్‌ హైవేపై లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి

జమ్మూకాశ్మీర్ లోని జాజ్జర్‌ కోట్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్‌సర్‌ నుండి కత్రా వెళ్తున్న బస్సు.. జాజ్జర్‌ సమీపంలో బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా , మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.