మంత్రి రోజా ఫై పోలీసులకు బుడబుక్కల సంఘం పిర్యాదు

వైసీపీ మంత్రి రోజా వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఈమె బుడబుక్కల కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిందని ఆ కుల సంఘం వారు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి రోజా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌‌లను విమర్శిస్తూ.. ఇద్దర్ని బుడబుక్కల వారితో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో బుడబుక్కల సంఘం మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై రోజా స్పందిస్తారో లేదో చూడాలి.