స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు !
![bse-Corona secondwave impact on stock markets](https://www.vaartha.com/wp-content/uploads/2021/04/bse-Corona-secondwave-impact-on-stock-markets-1024x583.jpg)
Mumbai: స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త పుంజుకుని చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద ముగిశాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/business/