మేడారం గోవింద రాజుల పూజారి దారుణ హత్య..

ప్రముఖ పుణ్యక్షేత్రం లో మేడారంలో విషాదం చోటుచేసుకుంది. మేడారం గోవింద రాజుల పూజారి దబగట్ల రవి(45) దారుణ హత్యకు గురయ్యాడు. కొండాయి గ్రామానికి చెందిన రవి గోవింద రాజుల ఆలయ పూజారిగా గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈయన్ను అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో అతి దారుణంగా హత్య చేసారు.

పూజారి హత్య తో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఓ పూజారిని ఇంత దారుణంగా హత్య చేయడమేంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన సమాచారాన్ని పోలీసులకు అందియ్యడం తో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిన్న సాయంత్రం ఘటన జరిగినట్టు భావిస్తున్నారు స్థానికులు. ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది.