బ్రో ట్రైలర్ విడుదల

పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ బ్రో. జులై 28 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ శనివారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ట్రైలర్ విషయానికి వస్తే.. భస్మాసూరుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవ్వడికి ఛాన్స్ ఇవ్వడు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ట్రైలర్ మొదలు అవుతుంది.

టైమ్ లేదు.. టైమ్ లేదు అంటూ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ను, ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి.. జీవితంలో పరుగులు పెడుతూ తేజ్ జీవిస్తుంటాడు. అదే సమయంలో అతనికి రోడ్డు ప్రమాదం జరుగుతుంది. కాలం విలువ తెలియని తేజ్ కు కాలం విలువ తెలియజేయడం కోసం పవన్ ఎంట్రీ ఇస్తాడు. ప్రతిదానికీ టైమ్ లేదంటావ్ కదా అదే నేను అంటూ పవన్ ను అంటాడు. ఓ రోడ్డు ప్రమాదం తేజ్ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది? అనే కథాంశంతో సినిమాను తీర్చిదిద్దారని తెలుస్తుంది.

ఇక పవన్ కళ్యాణ్ డ్రైవర్, వాచ్ మెన్, డాక్టర్ ఇలా విభిన్న గెటప్స్ తో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో పవన్ జల్సా మూవీలోని స్టిల్ ను మరోసారి వేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చారు. మొత్తంగా బ్రో…చూసేయ్యాలి బ్రో అనేలా ఉండబోతుందని అర్ధం అవుతుంది.

YouTube video