చంద్రబాబు ఫై బొత్స ఫైర్

botsa satyanarayana
botsa satyanarayana

టీడీపీ అధినేత చంద్రబాబు ఫై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతూ బీజేపీ గేట్లు తెరవాలని చూస్తున్నాడని.. బీజేపీ గేట్లు తెరిస్తే చంద్రబాబు దూరాలని చూస్తున్నాడని విమర్శించారు.

చంద్రబాబు జిత్తులమారి నక్క అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం జగన్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ..చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కూడా కనబడదని బొత్స జోస్యం తెలిపారు.