‘పల్లె గోస బీజేపీ భరోసా’ కార్యక్రమ ఇంఛార్జ్లను ప్రకటించిన బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయడంఖా మోగించాలని కసరత్తులు చేస్తున్న బిజెపి..‘పల్లె గోస… బీజేపీ భరోసా’ పేరుతో జులై 21 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై బైక్ ర్యాలీలు చేపట్టబోతుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 14 నియోజకవర్గాల్లో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ..బిజెపి అధికారంలోకి వచ్చాక చేపట్టే సంక్షేమ పథకాల గురించి తెలియజేసేలా ప్రణాళిక సిద్ధం చేసారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గాల ఇంఛార్జ్లను
అధిష్టానం ప్రకటించింది.

ఆ వివరాలు చూస్తే..

దేవరకద్ర – ఈటల రాజేందర్, ఎమ్మెల్యే

జుక్కల్ – వివేక్ వెంకటస్వామి, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు –

బోధన్ – రాజాసింగ్, ఎమ్మెల్యే

సిద్దిపేట – మురళీధర్ రావు, మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్

తాండూరు – డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

మేడ్చల్ – జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీ

ఆదిలాబాద్ – ధర్మపురి అరవింద్, ఎంపీ

మంచిర్యాల – సోయం బాబు రావు, ఎంపీ

వేములవాడ – ఎండల లక్ష్మి నారాయణ, మాజీ ఎమ్మెల్యే

వనపర్తి – డా. లక్ష్మణ్, ఎంపీ

కొత్తగూడెం – గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ

షాద్ నగర్ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ

కల్వకుర్తి – బాబు మోహన్, మాజీ మంత్రి

నర్సంపేట – రఘునందన్ రావు,ఎమ్మెల్యే