ప్రధాని మోడీ కి ఎంపీ వ‌రుణ్ గాంధీ లేఖ

క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై చ‌ట్టం చేయండి..వ‌రుణ్ గాంధీ

న్యూఢిల్లీ: పంట‌ల‌పై క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌కు సంబంధించిన చ‌ట్టాన్ని రూపొందించాల‌ని బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆయ‌న ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు. రైతు పంట‌ల‌కు సంబంధించిన ఇత‌ర అంశాల‌ను కూడా త‌క్ష‌ణ‌మే డిసైడ్ చేయాల‌ని త‌న లేఖ‌లో కోరారు. రైతులు వ్య‌తిరేకత వ్య‌క్తం చేస్తున్న మూడు సాగు చ‌ట్టాల‌ను ప్ర‌ధాని మోడీ ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ఆందోళ‌న చేప‌డుతున్న రైతులంతా తమ ఇండ్ల‌కు వెళ్లాలంటే త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం చ‌ట్టాన్ని చేయాల‌ని ఎంపీ వ‌రుణ్ గాంధీ డిమాండ్ చేశారు. రైతు చ‌ట్టాల విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ ముందు నుంచి వ్య‌తిరేకిస్తున్నారు. ఆందోళ‌న‌లు చేస్తూ సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయార‌ని, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు న‌ష్ట‌ప‌రిహారంగా కోటి ఇవ్వాల‌ని వ‌రుణ్ గాంధీ డిమాండ్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/