దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్
హైదరాబాద్ : కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తున్న దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్న రఘునందన్ రావును ఘట్కేసర్ పోలీసు స్టేషన్కు తరలించారు. కర్మన్ఘాట్ హనుమాన్ టెంపుల్ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో టెంపుల్ వద్దకు వస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కర్మన్ఘాట్ టెంపుల్ వద్ద పోలీసులు భారీ మోహరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/