జైల్లో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు

భర్త ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న భువనేశ్వరి

Bhuvaneshwari, Brahmani and Atchannaidu meet Chandrababu in jail

అమరావతిః రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనను కలిశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును భువనేశ్వరి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందనను చంద్రబాబుకు అచ్చెన్నాయుడు వివరించినట్ట సమాచారం. వీరి సమావేశం ములాఖత్ నిబంధనల ప్రకారం 45 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడే అవకాశం ఉంది.