‘శిల్పకళావేదిక’ లో భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుక

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోళా శంకర్ మూవీ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిరంజీవి , తమన్నా , కీర్తి సురేష్ , సుశాంత్ ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ చిత్రం తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ ఇలా ప్రతిదీ ఆకట్టుకోగా..ఈ నెల 06 చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరగబోతుంది. ఈ వేడుకను హైదరాబాద్ లోని ‘శిల్పకళావేదిక’ లో అట్టహాసంగా జరపబోతున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. వాల్తేర్ వీరయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరంజీవి..ఈ మూవీ తో మరో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. తమిళంలో వచ్చిన ‘వేదాళం’ సినిమాకి ఇది రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. AK ఎంటర్టెన్మెంట్ బ్యానర్ ఫై నిర్మితమైంది.